ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. ఏప్రిల్ నాలుగో వారంలో పరీక్షలు !

-

ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలర్ట్. ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ నాలుగో వారం నుంచి నిర్వహించే అవకాశం ఉంది. జేఈఈ మెయిన్ మొదటి విడత పూర్తయిన తర్వాతనే ఇంటర్ పరీక్షలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది. ఇంటర్ పరీక్షల నిర్వహణ పై సచివాలయంలో బుధవారం మంత్రి సురేష్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా పరీక్షల షెడ్యూల్ ను మార్పు చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. జే ఈ ఈ మెయిన్ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తున్నందున ఆ తర్వాత ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

పరీక్షలకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని మంత్రి సూచించడంతో ఇంటర్ బోర్డు అధికారులు షెడ్యూలు సిద్ధం చేశారు. దీనికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలోనూ ఇంటర్మీడియట్ పరీక్షలను రీషెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news