నేడు 10 మంది హై కోర్టు న్యాయ‌మూర్తుల ప్ర‌మాణ‌స్వీకారం

-

తెలంగాణ రాష్ట్ర హై కోర్టుకు ఇటీవ‌ల 10 మంది న్యాయ‌మూర్తులు కొత్త‌గా నియామ‌కం అయిన విషయం తెలిసిందే. కాగ ఈ న్యాయ‌మూర్తులు నేడు ఉద‌యం 9 : 45 గంట‌ల‌కు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. తెలంగాణ రాష్ట్ర హై కోర్టు చీఫ్ జ‌స్టిస్ స‌తీశ్ చంద్ర శ‌ర్మ ఈ ప‌ది మంది కొత్త న్యాయ‌మూర్తులతో ప్ర‌మాణ స్వీకారం చేయించ‌నున్నారు. కాగ రాష్ట్ర హై కోర్టుకు.. నూతనంగా నియామకైన న్యాయమూర్తుల్లో న్యాయవాదుల కోటా నుంచి కాసోజు సురేందర్‌, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్‌ కుమార్‌, ఎన్‌.వి. జువ్వాడి శ్రీదేవి, ఎన్‌.వి శ్రావణ్‌కుమార్​ ఎంపికయ్యారు.

అదే విధంగా న్యాయాధికారుల కోటా నుంచి జి.అనుపమా చక్రవర్తి, మాటూరి గిరిజా ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఏనుగు సంతోష్‌రెడ్డి, డాక్టర్‌ దేవరాజ్‌ నాగార్జున్‌ ఉన్నారు. కాగ ఇటీవ‌ల కొలిజీయం.. 12 మంది న్యాయ‌మూర్తుల‌ను సిపార్సు చేయ‌గా.. కేంద్రం ప‌ది మందికి ఆమోదం తెలిపింది. కాగ మంగ‌ళ వారం వీరి నియామ‌కానికి రాష్ట్ర ప‌తి ఆమోదం తెలిపారు. ఈ ప‌ది మంది న్యాయ‌మూర్తుల రాక‌తో హై కోర్టులో మొత్తం న్యాయ‌మూర్తుల సంఖ్య 29కి చేరింది. కాగ తెలంగాణ రాష్ట్ర హై కోర్టులో ఉండాల్సిన న్యాయమూర్తుల సంఖ్య 42.

Read more RELATED
Recommended to you

Latest news