టీ జే ఎస్ విలీనంపై కోదండరామ్ క్లారిటీ…

-

తెలంగాణ రాజకీయాల్లో సుమారుగా 10 సం,,పాటు ప్రో,, కోదండరాం కీలక నేతగా ఉన్నారు. రాష్ట్ర సాధనలో జెఏసి ఛైర్మెన్ గా తన వంతు కృషి చేసారు. తెలంగాణ సాధనలో తన కంటూ ఒక స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అయితే స్వంతంగా రాజకీయ పార్టీ నెలకొల్పిన, ఆ తర్వాత రాజకీయంగా రాణించలేకపోయారు. అయన స్థాపించిన తెలంగాణ జన సమితి ఉనికిని చాటుకోలేకపోయింది.

 

 

 

స్వయంగా ఎంల్ సి గా పోటీ చేసి ఓటమి కావడంతో ఆ పార్టీ భవిష్యత్ ఆందోళనలో పడింది. గత ఏడాది ఎం ల్ సి ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీజె ఎస్ పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రచారం అయింది. వాస్తవానికి కోదండ రామ్ ని వ్వక్తిగతంగా ఉన్నత వ్వక్తిగా ప్రజలు గుర్తించారు. కానీ పార్టీ ని సరైన క్రమంలో నడపాలంటే ఆయనకు సరైన వ్యూహం లేదని అనుకుంటున్నారు. ఎప్పుడు ఆయన పార్టీ కి సరైన ఊర్పు రాలేదు. అందకే పార్టీ ని వేరే పార్టీ లో విలీనం చేసే ఆలోచనలో ఉన్నట్లు తరుచు వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా పార్టీ కి మరింత బలం చేకూర్చే పరిణామం చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం పరిధిలోని రావిరాళ ఫామ్ హౌస్ లో టీ జె ఎస్ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీ లో ముఖ్య నేతలు అందరూ హాజరయ్యారు. ఆమ్ఆద్మీ పార్టీ లో విలీనం చేయాలనీ ప్రతిపాదనలు కూడ వచ్చాయి. అయితే ఏ విషయం పై కోదండరాం చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. చాలా నేతలు ఆమ్ ఆద్మీ పార్టీ వైపే మొగ్గు చూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే టీ జె ఎస్ పార్టీ అధినేత కోదండ రామ్ మాత్రం ఎన్నికలు సమీపిస్తుండటంతో అప్పటి వరకు వేచి చూసే ధోరణిలో ఉండాలని చూచించినట్లు తెలుస్తుంది. ఆమ్ ఆద్మీ ముఖ్య నేత టీ జె ఎస్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యం లోనే 1 , 2 రోజుల్లో కేజ్రీవాల్ హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. అయితే కేజ్రీవాల్, కోదండ రామ్ భేటీ ఉందని విశ్వసనియ ఆలోచన….

Read more RELATED
Recommended to you

Latest news