కారు కొనాలనుకునే వారికి టాటా షాక్…. కార్ల రేట్లను పెంచుతూ నిర్ణయం

-

అసలే సెమికండక్టర్ల కొరతతో ఇబ్బందులు పడుతున్న ఆటో మొబైల్స్ ఇండస్ట్రీ మడిపదార్థాల ధరలు పెరగడంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సెమికండక్టర్ల కొరత కారణంగా ఇప్పుడు కార్ బుక్ చేస్తే కానీ… ఓ ఆరు నెలల వరకు కారు రాని పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే కార్ కొనాలనుకునే వారికి షాక్ ఇచ్చింది దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా. తమ కార్ రేట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. మోడల్ , వేరియంట్ ను బట్టి గరిష్టంగా 1.1 శాతం పెంచుతామని వెల్లడించింది. పెంచిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని వెల్లడించింది. రష్యా- ఉక్రెయిన్ పరిణామాలు, ముడిపదార్థాల ధరలు, నిర్వహణ వ్యయాలు పెరగడంతో కార్ల ధరలు పెంచడం తప్పడం లేదని టాటా మోటార్స్ వెల్లడించింది. ఇటీవల మారుతి, బీఎండబ్య్లూ కంపెనీలు కూడా తమ కార్ల రేట్లను పెంచాయి. ఏది ఏమైనా కార్ తీసుకుందామని ఎన్నాళ్ల నుంచో ప్లాన్ చేసుకుంటున్న వారికి పెరిగిన ధరలు ప్రతిబంధకంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news