Breaking News : సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ లేఖ..

-

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీస్‌ శాఖలో ఖాళీల భర్తీ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే పోలీస్‌ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌ వయో పరిమితి సడలింపు ఇవ్వాలని కోరుతూ.. సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ రేవంత్‌ రెడ్డి లేఖ రాశారు.

Revanth Reddy Targets KCR But Hits BJP

ఉద్యోగాల నోటిఫికేషన్ల ఆలస్యం వల్ల వయోపరిమితితో చాలా మంది అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారన్న రేవంత్‌ రెడ్డి.. సడలింపు ఇచ్చి కానిస్టేబుల్ ఉద్యోగాల అభ్యర్థులకు వయో పరిమితి సడలింపు ఇవ్వాలని లేఖలో కోరారు. ట్విట్టర్‌లో కేటీఆర్‌కు అభ్యర్దులు అడిగినా పట్టించుకోలేదని, డీజీపీ ఆఫీసు చుట్టూ తిరిగిన ప్రయోజనం లేదంటూ రేవంత్‌ లేఖలో పేర్కొన్నారు. మీరేమో ఫామ్ హౌస్ లో సేద తీరుతున్నారంటూ వ్యంగ్యా్స్త్రాలు సంధించారు. అభ్యర్ధుల సమస్యలు పట్టించుకునే వారే లేరంటూ ఆయన మండిపడ్డారు. రెండేళ్ల సడలింపు కానిస్టేబుల్ పోస్టుల అభ్యర్థులకు ఇవ్వాలని ఆయన లేఖలో సీఎం కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news