Jammu Kashmir: అవంతిపొరా ఎన్ కౌంటర్… ఇద్దరు టెర్రరిస్టుల హతం

-

జమ్మూ కాశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. అవంతిపోరా లోని రాజ్ పోరా ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులున్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా… ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు టెర్రరిస్టులను హతమార్చాయి భద్రతా బలగాలు. వారి వద్ద నుంచి రెండు ఏకే 47 తుపాకును స్వాధీనం చేసుకున్నాయి. హతమైన ఉగ్రవాదులను త్రాల్ ఏరియాకు చెందిన షామీద్ రాథర్, షోపియాన్ కు చెందిన ఉమర్ యూసుఫ్ గా గుర్తించారు పోలీసులు. వీరిద్దరు పౌరులను టార్గెట్ చేస్తూ చంపిన కేసుల్లో నిందితులుగా ఉన్నారని.. అరిపాల్ చెంది షకీలా, ట్రాల్ కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి జావిద్ అహ్మద్ హత్య నేరంలో ప్రమేయ ఉందని కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఏడాది గడిచిన 5 నెలులగా 26 మంది విదేశీ ఉగ్రవాదులను హతమార్చినట్లు ఆయన తెలిపారు. వీరంతా లష్కరేతోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news