తిరుపతి నుంచి పవన్‌ యాత్ర : నాదెండ్ల మనోహర్‌

-

ఏపీలో ఇంకా ఎన్నికలకు రెండు సంవత్సరాలు ఉండగానే రాజకీయాల్లో వేడి పెరిగింది. రోజు రోజుకు ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అయితే గతంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ చెప్పినట్లుగానే ఏపీ వ్యాప్తంగా యాత్ర చేసేందుకు ఆ పార్టీలో వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో యాత్ర చేపట్టనున్నట్లు పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. అక్టోబర్‌లో తిరుపతి నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుందన్నారు.

Nadendla Manohar slams AP govt. over arrest of Jana Sena leaders protesting  for job recruitments

జగన్ పాలనలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ప్రణాళిక లేని పాలన వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. జగన్ వర్క్ ఫ్రం హోం సీఎం అని, ప్రభుత్వాన్ని నడపడం చేతకాకే చేతులు ఎత్తేశాడని విమర్శించారు. అందుకే వచ్చే మార్చిలో జగన్ ఎన్నికలకు వెళతాడని, దీనిపై తమ వద్ద పక్కా సమాచారం ఉందన్నారు. నిజాయితీకి నిదర్శనంగా ఉండే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని నాదెండ్ల మనోహర్‌ ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news