దమ్ముంటే..నీ ఆస్తులను ఏటా ప్రకటించు – కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్

-

దమ్ముంటే..నీ ఆస్తులను ఏటా ప్రకటించు అని సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్‌ విసిరారు. ఉపాధ్యాయులు ఏటా ప్రభుత్వానికి ఆస్తుల వివరాలు సమర్పించాలని, ఇకపై స్థిర, చర ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడాన్ని బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

బండి సంజయ్
బండి సంజయ్

ఇది ముమ్మాటికీ ఉపాధ్యాయులను వేధించడంలో భాగంగా జారీ చేసిన ఆదేశాలుగానే భావిస్తున్నాం. వినాశకాలే విపరీత బుద్ది అనే చందంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయకులను వేధించడమే లక్ష్యంగా పిచ్చి తుగ్లక్ మాదిరిగా నిర్ణయాలు తీసుకుంటున్నారని.. 317 జీవో పేరుతో ఉద్యోగుల, ఉపాధ్యాయులను రాచిరంపాన పెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు బదిలీలు చేస్తూ టీచర్లకు అన్యాయం చేస్తున్నారు.

అయినా ముఖ్యమంత్రికి ఇంకా కక్ష తీరనట్లుందని పేర్కొన్నారు. చదువు చెప్పే సర్కారీ టీచర్లు ఇకపై ప్రతి ఏటా ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలని , ఇకపై ఆస్తులు అమ్మాలన్నా… కొనాలన్నా ముందస్తుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని చెప్పడం వేధింపుల్లో భాగమే. ఉద్యోగులకు జీతాలే సక్రమంగా చెల్లించకుండా… ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించని కేసీఆర్ ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం హస్యాస్పదం… టీఆర్ఎస్ నియంత–కుటుంబ–అవినీతి-దుర్మార్గపు పాలనలో తీసుకుంటున్న నిర్ణయాలను టీచర్లు ప్రశ్నిస్తుంటే కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. 317 జీవోను వ్యతిరేకిస్తూ సర్కార్ ను నిలదీస్తే తట్టుకోలేకపోతున్నారు. అడ్డదారిలో అక్రమంగా బదిలీలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్న సర్కార్ తప్పులను ఎండగడుతుంటే ఆగమాగమైతున్నారని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news