ద్రౌపది ముర్ము సొంత ఊళ్లోనే కరెంట్ లేదు – కేటీఆర్‌ సెటైర్లు

-

ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము సొంత ఊళ్లోనే కరెంట్ లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ సెటైర్లు వేశారు. మోడీ పీఎం అయ్యాక 8 కి పైగా రాష్ట్రాల్లో మెజార్టీ లేకపోయినా, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి కైవసం చేసుకుంటారని…గట్టిగా మాట్లాడితే ఏజెన్సీలను పురి గొల్పుతున్నారని నిప్పులు చెరిగారు.

ప్రజా స్వామ్యంలో ప్రజలు తిరగబడే రోజు వస్తుందని… తిరగబడేది తెలంగాణా నుంచే రావచ్చని హెచ్చరించారు. తెలంగాణ కు కేంద్రం ఎక్కువ ఇచ్చింది, రాష్ట్రం తెలంగాణ కు ఎక్కువ ఇచ్చిందా.. కేంద్రం శ్వేత పత్రం విడుదల చెయ్యాలని డిమాండ్‌ చేశారు. కేంద్రానికి తెలంగాణ ఇచ్చిన దానికంటే, వాళ్ళు ఎక్కువ ఇచ్చినట్లు చూపెడితే… నా మంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్తానని కేటీఆర్ సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news