వైసీపీ నేతల సైకోయిజం ప్రజల పాలిట శాపంగా మారింది: లోకేష్‌

-

ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. మరోసారి వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సీపీ నాయకుల సైకోయిజం ప్రజల పాలిట శాపంగా మారిందని నారా లోకేష్ పేర్కొన్నారు. అధికార మదంతో ఏలూరులో నమస్కారం పెట్టలేదని రేషన్ వాహన డ్రైవర్‌పై దాడి చేయడం దారుణమన్నారు నారా లోకేష్.

Nara Lokesh attends Vijayawada Court, slams AP govt. says it can't cause  any harm to him

వైసీపీ కార్పొరేటర్ స్రవంతికి నమస్కారం పెట్టలేదని ఆమె భర్త నాగరాజు, వారి అనుచరులు కలిసి రేషన్ వాహన డ్రైవర్ శ్రీనివాస్‌పై రోకలి బండతో దాడికి పాల్పడ్డారన్నారు నారా లోకేష్. శ్రీనివాస్‌పై అత్యంత కిరాతకంగా దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు నారా లోకేష్.

 

Read more RELATED
Recommended to you

Latest news