నేటి నుంచి ఏపీ ఈఎపీ/ ఎంసెట్.. విద్యార్థులు వీటిని తప్పక తెలుసుకోవాలి..

-

కరోనా మహమ్మరి వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో జరగవలసిన అన్నీ పోటీ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే..ఈ ఏడాది వైరస్ ప్రభావం బాగా తగ్గడంతో పరీక్షలన్నీ అనుకున్న సమయానికే ప్రశాంతంగా సాగుతున్నాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటికే అనేక బోర్డు పరీక్షలు పూర్తి అయ్యాయి. వాటి ఫలితాలు కూడా దాదాపుగా విడుదలయ్యాయి..

ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఈఏపీసెట్-EAPCET (EAMCET-2022) పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంజనీరింగ్ కు సంబంధించి జులై 4 నుంచి 8వ తేదీ వరకు.. బైపీసీ వారికి 11 నుంచి 12 వరకు ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు అధికారులు..

దీనికి సంభందించిన కొన్ని కీలక రూల్స్ ను విడుదల చేసింది విద్యాశాఖ..విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 7.30 గంటలు, మధ్యాహ్నం 1.30 గంటల నంచే అనుమతిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించి సమయానికంటే ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. హాల్ టికెట్ తో పాటే పరీక్షా కేంద్రం రూట్ మ్యాప్ వస్తుందన్నారు..

ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు పరీక్షా కంద్రాల వద్దనే తమ కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు ఏమైనా సందేహాలుంటే.. 08554-234311, 232248 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఇదిలా ఉంటే ఈ సారి ఎంసెట్ పేపర్ తెలుగు, ఇంగ్లీషు లలో వస్తుందని చెప్పారు.160 ప్రశ్నలకు గాను.. 180 నిముషాల పాటు పరీక్ష జరుగుతుందన్నారు. ఆగస్టు 15 తర్వాత ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. ఎగ్జామ్‌ ప్యాట్రన్‌, ర్యాంకుల విధానంలో ఎటువంటి మార్పులు లేవని అధికారులు స్పష్టం చేశారు.. వీటిని దృష్టిలో ఉంచుకొని పరీక్షా కేంద్రాలకు వెళ్ళాలని విద్యార్థులకు సూచించారు..

Read more RELATED
Recommended to you

Latest news