పెద్ద కుంభకోణాన్ని వచ్చే వారం బయటపెడతా.. నారా లోకేష్‌ సంచలనం

-

ఏపీలో రాజకీయ రోజు రోజుకు వేడెక్కుతోంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. అయితే ఇటీవల వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో అంటూ ఓ వీడియో రచ్చ లేపిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా.. టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుని సంచలన ప్రకటన చేశారు. జగన్ కు సంబంధించిన పెద్ద కుంభకోణాన్ని వచ్చే వారం బయటపెడతానని తెలిపారు నారా లోకేశ్.

Nara Lokesh: If I apologize .. we will go to meetings .. – 2Telugustates

ఈడీ, ఐటీ, సీబీఐకి భయపడి ఢిల్లీలో తలవంచారని విమర్శించారు నారా లోకేశ్. జగన్ వన్నీ పదో తరగతి పాస్-డిగ్రీ ఫెయిల్ తెలివితేటలు అని పేర్కొన్నారు నారా లోకేశ్. వైసీపీ హయాంలో వచ్చినవాటి కంటే వెళ్లిపోయిన పరిశ్రమలే ఎక్కువని వెల్లడించారు నారా లోకేశ్. పెట్టుబడులు పెట్టాలంటే సీఎంవో వాటా ఎంతనేది చర్చకు వస్తోందని ఆరోపించారు. వచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేస్తే చర్చకు సిద్ధమని ప్రకటించారు నారా లోకేశ్.

 

Read more RELATED
Recommended to you

Latest news