షెకావత్​ జీ కాళేశ్వరం సంగతి ఏం చేస్తుండ్రు : రేవంత్

-

కేంద్ర జల్​ శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కు కాళేశ్వరం అవినీతిపై ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ తరపున చెప్పి చూశామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అన్నారు. చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తే పెడచెవిన పెట్టారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఆయనే అవినీతి జరిగిందనడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. మాటలు సరే ముందు చర్యల సంగతి ఏంటో చెప్పాలని షెకావత్​ను రేవంత్‌రెడ్డి ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.

గోదావరికి వచ్చిన భారీ వరదతో మునిగిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 2 కీలక పంపుహౌస్​లు నీట మునిగాయి. కాళేశ్వరం పనుల్లో అవినీతి జరిగిందని.. నాణ్యత లేకపోవడం వల్లే పంపుహౌస లు మునిగాయని ప్రతిపక్షాలు కోడై కూశాయి. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కమీషన్ల కోసమే కట్టారని కేంద్ర మంత్రులు కూడా విమర్శలు చేశారు. ఈ విషయంపై పూర్తి వివరాలు తెలుసుకుని త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తామని అన్నారు. ఈ క్రమంలోనే రేవంత్ కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కు ట్వీట్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news