ఖమ్మం బైక్ లిఫ్టు కేసులో మృతుడి భార్య అరెస్టు

-

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బైక్ లిఫ్టు మర్డర్ మిస్టరీని ఖమ్మం పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ముందు నుంచి అనుమానిస్తున్నట్టు ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు నిర్ధారించారు. హత్యకు కుట్ర పన్నిన మృతుడు జమాల్ భార్య ఇనామ్​బీతో పాటు సహకరించిన, హత్య చేసిన నిందితులు మోహన్ రావు, వెంకటేశ్, వెంకట్​లను పోలీసులు అరెస్టు చేశారు.

మోహన్‌రావు, వెంకటేశ్, వెంకట్​లు చింతకాని మండలం నామవారం వాసులుగా గుర్తించిన పోలీసులు.. రెండు నెలల నుంచే జమాల్‌సాహెబ్ హత్యకు నిందితులు కుట్రపన్నుతున్నట్లు తెలిపారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని జమాల్‌సాహెబ్‌ హత్యకు పథకం రచించారని.. భర్తను చంపేందుకు భార్య ఇమామ్​బీ ఇంట్లోనే ఇంజక్షన్‌ దాచిపెట్టిందని వెల్లడించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన జమాల్ సాహెబ్ ముదిగొండ మండలం వల్లభి సమీపంలో సోమవారం ఇంజక్షన్ దాడిలో మృతి చెందాడు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఖమ్మం పోలీసులు కేవలం 24 గంటల్లోనే మిస్టరీని ఛేదించారు.

Read more RELATED
Recommended to you

Latest news