Breaking : కేరళలో దారుణం.. మహిళల నరబలి

-

టెక్నాలజీ పెరిగి చంద్రుడు పైకి వెళ్తున్న వైపు ప్రపంచ ఉంటే.. మరో పక్క మూఢనమ్మకాలను నమ్ముకొని పాతాలంలో కొందరు ఉండిపోతున్నారు. మూఢనమ్మకాల అంధకారంలో చేయరాని పనులు చేస్తున్నారు. నిధుల కోసం నరబలులు ఇచ్చిన ఘటనలు గతంలో చాలానే వెలుగుచూశాయి. తాజాగా, కేరళలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. ఆర్థికంగా లాభపడతామని భావించిన భార్యాభర్తలు ఇద్దరు అమాయక మహిళలను బలిచ్చారు. పోలీసుల కథనం ప్రకారం.. తిరువళ్లకు చెందిన భగవంత్ సింగ్-లైలా భార్యాభర్తలు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వీరు వాటి నుంచి బయటపడడంతోపాటు సిరిసంపదలు కలుగుతాయన్న ఉద్దేశంతో నరబలి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వీరికి మహ్మద్ షఫీ అనే వ్యక్తి తోడయ్యాడు. అందరూ కలిసి నరబలికి సిద్ధమయ్యారు.

നരബലിയുടെ ഞെട്ടലില്‍ കേരളം; കുടുംബത്തിന്റെ ഐശ്വര്യത്തിന് സ്ത്രീകളെ  തലയറുത്ത് കൊന്നു, ക്രൂരത ഇങ്ങനെ, human sacrifice kerala,kerala narabali,kochi  women murder,

ఈ క్రమంలో కడవంతర, కాలడీలకు చెందిన ఇద్దరు మహిళలతో షఫీ సామాజిక మాధ్యమాల్లో స్నేహం చేశాడు. పథకంలో భాగంగా గత నెల 26న ఆ ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేశాడు. అనంతరం భగవంత్ సింగ్ దంపతులతో కలిసి వారిని బలిచ్చాడు. మృతదేహాలను ముక్కలు చేసి పాతిపెట్టారు. బాధిత మహిళలను లాటరీ టికెట్లు విక్రయిస్తూ జీవించే పద్మం (52), రోస్లీ (50)గా పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో వారు చెప్పిన విషయాలు విని విస్తుపోయారు. ఆర్థికంగా లాభపడేందుకే నరబలి ఇచ్చినట్టు చెప్పడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news