రాజగోపాల్ రెడ్డి రూ. 18 వేల కోట్లపై ప్రచారం చేయండి – సీఎం కేసీఆర్

-

దేశ రాజధాని ఢిల్లీ పర్యటన ముగించుకున్న సీఎం కేసీఆర్… నిన్న తిరిగి హైదరాబాద్ కు వచ్చారు. హైదరాబాద్ కు వచ్చి రాగానే, మునుగోడు ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్. నిన్న రాత్రి ప్రగతి భవన్ లో టిఆర్ఎస్ కీలక నేతలతో అలాగే మునుగోడు నాయకులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక  వ్యాఖ్యలు చేశారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన 18 వేల కోట్లపై ప్రచారం చేయాలని టిఆర్ఎస్ నేతలకు దిశా నిర్దేశం చేశారు. 18 వేల కోట్ల కాంట్రాక్టు పై పదే పదే ప్రచారం నిర్వహించాలని సూచించారు. దీంతోపాటు మోడీ ప్రభుత్వ విధానాలను కూడా ఎండగట్టాలని ఆయన పేర్కొన్నారు. మునుగోడు లో టిఆర్ఎస్ పార్టీకి మంచి ఓటింగ్ ఉందని… దాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news