Breaking: ఏపీ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా కొమ్మినేని శ్రీనివాసరావు

-

అమరావతి ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు నియామకమయ్యారు. వచ్చే నెల 7వ తేదీన ప్రస్తుత ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనాథ్ రెడ్డి పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త ఛైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావును నియామించింది ఏపీ ప్రభుత్వం. ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు విడుదల అయ్యే అవకాశం ఉంది. అయతే.. గతంలో ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్‌ రెడ్డి పదవీకాలాన్ని జగన్ సర్కార్ పొడిగించింది.

Kommineni YSR Congress, Kommineni Anti TDP

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనాథ్‌రెడ్డిని 2019లో ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా నియమించింది. 2021 నవంబరు 7తో ఆయన రెండేళ్ల పదవీకాలం పూర్తయింది. అప్పటి నుంచి మరో ఏడాదిపాటు పదవీ కాలాన్ని పొడిగిస్తూ అప్పటి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం శ్రీనాథ్ రెడ్డి పదవిలో కొనసాగుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news