రేపటి నుంచి యాదాద్రి ఆలయంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు

-

యాదాద్రి వెళ్లే భక్తులకు శుభవార్త. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు, విఐపి మరియు వివిఐపీలకు తిరుపతి తరహాలో దర్శనాలు కలిగించే ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ఈనెల 31 నుంచి అంటే రేపటి నుంచి బ్రేక్ దర్శనాలు అమలు చేయనున్నట్లు ఈవో గీతారెడ్డి శనివారం ప్రకటన చేశారు.

ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు బ్రేక్ దర్శనాలు కల్పించనున్నారు. బ్రేక్ దర్శనానికి ఒక్కొక్కరికి టికెట్ ధర 300 రూపాయలుగా నిర్ణయించారు.

ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు మొదటి దశలో 200 అలాగే సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు కొనసాగే బ్రేక్ దర్శనాలకు 200 టికెట్లు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఈ బ్రేక్ దర్శనం టికెట్ కొనుగోలు చేసి ఆయా సమయాల్లో వచ్చిన భక్తులను ఉత్తర రాజగోపురం నుంచి శ్రీవారి స్వామి దర్శనాలకు పంపించమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news