BREAKING : మందుబాబులకు షాక్.. ఏపీలో భారీగా పెరిగిన బీరు ధరలు

-

BREAKING : ఏపీ మందుబాబులకు షాక్ తగిలింది. ఏపీలో భారీగా బీరు, క్వార్టర్‌ ధరలు పెరిగి పోయాయి. తాజాగా ఏపీలో కొత్తగా మరో 10 మద్యం బ్రాండ్లు అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఈ మేరకు ఏపీఎస్‌బీసీఎల్ అనుమతులు మంజూరు చేసింది.

అంతేకాకుండా, అదే కేటగిరీలోని మిగతా బ్రాండ్ల కంటే ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం కొన్ని కేటగిరీల బీరు ధర రూ. 200గా ఉంది. ఇప్పుడు కొత్తగా అనుమతి పొందిన బ్రాండ్ల బీరు ధర రూ. 220గా ఉంది. అలాగే, కొన్ని కేటగిరీల్లో క్వార్టర్ మద్యం ధర రూ. 110గా ఉంటే, ఇప్పుడు కొత్తగా అనుమతి పొందిన బ్రాండ్ల మద్యం క్వార్టర్ ధర రూ. 130గా ఉంది. దీంతో ఏపీ మందు బాబులు నిరాశకు లోనైయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news