రోజా పందిలా తింటుంది – కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

-

ఏపీ మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నాని పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి రోజా పందిలా తింటుందని, పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతుందో బండి సంజయ్ లాగా మాట్లాడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసిపి మంత్రులు పదే పదే తన పేరును ఎందుకు తీసుకువస్తున్నారని మండిపడ్డారు.

“జగన్ గారు.. మీరు మీ మంత్రులతో పిచ్చికుక్కల్లా మాట్లాడిస్తున్నారు. మీరు ఏపీ ముఖ్యమంత్రిగా ఎంతగా ఫెయిల్ అయ్యారో మీకు తెలుసు.. మీ ఎమ్మెల్యే లకి, మంత్రులకి తెలుసు. మూడున్నర ఏళ్లుగా మోడీకి పాద పూజ చేసినప్పటికీ ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు, రాజధానిని నిర్మించలేకపోయారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు తేలేకపోయారు. చివరికి లక్షల కోట్ల అప్పులు చేసి సమస్యని పక్కదోవ పట్టించడానికి మీ మంత్రులతో పిచ్చికుక్కల మాట్లాడిస్తున్నారు.

రోజా అంట.. ఒక పంది లాగా తింటదేమో ఆవిడ. పిచ్చి కుక్క కరిస్తే ఎలా మాట్లాడుతుందో బండి సంజయ్ లాగా మాట్లాడుతుంది. లాస్ట్ వీక్ ఆ కొడాలి నాని గాడు అంట. వాడెవడో నాకు తెలియదు. మధ్యలో నా పేరు ఎందుకు తీసుకు రావడం. మీకు కనీసం బుద్ధుందా” అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కే ఏ పాల్. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news