Breaking : మాచర్లలో కొనసాగుతున్న 144 సెక్షన్‌..

-

గుంటూరు జిల్లా మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు టీడీపీ నేతలు మాచర్లకు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే.. మాచర్ల టీడీపీ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మరెడ్డి నివాసం, పార్టీ కార్యాలయం, వాహనాలకు దుండగులు నిప్పు పెట్టిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో మాచర్ల ఉద్రిక్తంగా మారింది. పట్టణంలో పరిస్థితి మరింత చేజారకుండా ఉండేందుకు పోలీసులు 144 సెక్షన్ విధించారు.

Macherla: పల్నాడులో టెన్షన్ టెన్షన్.. రణరంగంగా మాచర్ల.. కర్రలు, రాళ్లతో  వీరంగం.. | After the attacks on Friday in Macherla, the police have made a  tight security Telugu News | TV9 Telugu

మరోవైపు ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. మాచర్లలో అదనపు బలగాలను మోహరించినట్టు చెప్పారు. ఐజీ త్రివిక్రమ్ ను మాచర్లకు పంపినట్టు వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పారు. శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. ఘటనకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news