IPL 2023 Auction : నేడే ఐపీఎల్ మినీ వేలం.. ఉన్నది 405 మంది.. చోటు 87 మందికే!

-

IPL 2023 Auction : ఐపీఎల్‌ మినీ వేలానికి కౌంట్‌ డౌన్‌ స్టార్‌ అయింది. ఐపీఎల్ 2023 వేలానికి కేవలం మరి కొన్ని గంటలే మిగిలి ఉంది. ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి వేలం ప్రారంభం కానుంది. ఈ సారి వేలంలో 405 మంది ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో 87 మందిని ఎంపిక చేసుకోవచ్చు.

119 మంది ఆటగాళ్లకు అంతర్జాతీయ మ్యాచులు ఆడిన అనుభవం ఉంది. 282 మంది ఆటగాళ్లు అన్ క్యాప్ లిస్టులో ఉన్నారు. 2 కోట్ల బేస్ ప్రైస్ లో 19 మంది, రూ. 1.5 కోట్ల బేస్ ప్రైజ్ లో 11 మంది, రూ. కోటి ప్రైస్ లో 20 మంది ఆటగాళ్లు ఉన్నారు. కాగా, ఈ సారి వేలంలో మన సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news