కెసిఆర్ హఠావో.. తెలంగాణ బచావో – ఎంపీ లక్ష్మణ్

-

తెలంగాణను కెసిఆర్ ఫ్యామిలీ నుంచి కాపాడడానికి కెసిఆర్ హఠావో.. తెలంగాణ బచావో నినాదంతో ముందుకు వెళతామన్నారు బిజెపి ఎంపీ లక్ష్మణ్. 90 అసెంబ్లీ, 400 పార్లమెంటు స్థానాలే లక్ష్యంగా బిజెపి రూట్ మ్యాప్ సిద్ధమైందన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనవరి 20వ తేదీ నుండి ఫిబ్రవరి 5వ తేదీ వరకు గ్రామాలలో సభలు నిర్వహిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 15 నుండి అసెంబ్లీ నియోజకవర్గాలలో సభలు.. అలాగే మార్చిలో జిల్లా స్థాయిలో సభలు నిర్వహిస్తామని వివరించారు.

తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే ప్రజలకు ఉచిత వైద్యం, విద్యా అందిస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ లో అమిత్ షా లేదా జెపి నడ్డా తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారని.. ఆ సభలో కెసిఆర్ ప్రభుత్వం పై చార్జీ షీట్ విడుదల చేస్తామన్నారు. తెలంగాణలో అత్యధిక పార్లమెంటు స్థానాలలో గెలుపే లక్ష్యంగా బిఎల్ సంతోష్ ఆధ్వర్యంలో రూట్ మ్యాప్ రూపొందించామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news