మరో విషాదం : ప్రముఖ కొరియోగ్రాఫర్ సుచిత్ర తండ్రి మృతి..!

-

ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది.. ఒకరి మరణం జీర్ణించుకోకముందే మరొకరి మరణం సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఈ క్రమంలోని సుచిత్ర చంద్రబోస్, గేయ రచయిత చంద్రబోస్ దంపతులు అన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా వీరి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. సుచిత్రా చంద్రబోస్ తండ్రి చాంద్ బాషా (92) రాత్రి హైదరాబాదు మణికొండలో మృతి చెందారు. ఈయన చంద్రబోస్ కి మామగారు.

చాంద్ బాషా దక్షిణాదిన అనేక సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఈయనకి ముగ్గురు అమ్మాయిలు , ఒక కొడుకు ఉన్నారు. తెలుగులో ఖడ్గ తిక్కన్న, బంగారు సంకెళ్ళు, స్నేహమేరా జీవితం, మానవుడే దేవుడు వంటి చిత్రాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించిన ఈయన కన్నడలో అమర భారతి , చేడిన కిడి కన్నడ వంటి అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

ఇకపోతే చంద్రబోస్ ఫ్యామిలీకి పలువురు సెలబ్రిటీలు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక వీరి కూతురు సుచిత్ర కొరియోగ్రాఫర్ గా రాణిస్తుండగా అల్లుడు చంద్రబోస్ స్టార్ లిరిసిస్ట్ గా గుర్తింపు పొందారు.

Read more RELATED
Recommended to you

Latest news