మార్చి 28, 29 తేదీలలో జీ – 20 వర్కింగ్ గ్రూప్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం

-

విశాఖ: మార్చి 28, 29 తేదీల్లో జీ – 20 వర్కింగ్ గ్రూప్ సమావేశానికి ఆంద్రప్రదేశ్ ఆతిధ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి 40 దేశాల నుంచి సుమారు 300 మంది ప్రతినిధులు రానున్నారు. ఈ నేపథ్యంలో జీ-20 సమావేశాల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షించారు సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీలక్ష్మి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విశాఖ సుందరమైన నగరం అని.. మన సంస్కృతి, సాంప్రదాయాలు పర్యాటక రంగాన్ని విదేశీ అతిథులకు పరిచయం చేస్తామన్నారు.

జీ 20 సమావేశంకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమావేశానికి సంబంధించిన కమిటీలు నియమిస్తూన్నామని తెలిపారు. ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటక ప్రాంతాలను గుర్తించామన్నారు. నావి పోర్ట్ అధికారుల సహకారం తీసుకొని విజయవంతం చేస్తామన్నారు. ఙివిఎంసిని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు శ్రీలక్ష్మి. అలాగే సిటీ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. జీ 20 సమావేశాలకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే సెక్యూరిటీ ఆడిట్ పూర్తి చేశామని.. పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వైజాగ్ సేఫ్ సిటీగా ప్రమోట్ చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news