ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో 9 మంది మృతి

-

మహారాష్ట్రలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మది మంది దుర్మరణం చెందారు. ఒకరు గాయపడ్డారు. రాయగడ జిల్లా రెపోలీ ప్రాంతంలో ముంబయి-గోవా రహదారిపై గురువారం ఉదయం 4.45కు జరిగిందీ ప్రమాదం.

పోలీసుల సమాచారం ప్రకారం.. వ్యాన్​లో ఉన్నవారంతా బంధువులు. అందరూ కలిసి రత్నగిరి జిల్లాలోని గుహాగర్​కు వెళ్తున్నారు. ముంబయి వెళ్తున్న లారీ.. వేగంగా వచ్చి వ్యాన్​ను ఢీకొట్టింది. వ్యాన్​లోని ఒక బాలిక, ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు మరణించారు. మరో నాలుగేళ్ల బాలికకు గాయాలయ్యాయి.

సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ చిన్నారిని మన్​గావ్​లోని ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం పరీక్షల కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. ప్రమాదానికి కారణమేంటో తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news