లోకేష్ పాదయాత్ర అపశృతులతో మొదలైంది – మంత్రి అప్పలరాజు

-

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో శుక్రవారం కుప్పం నుండి పాదయాత్ర మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే లోకేష్ చేపట్టిన ఈ పాదయాత్ర పై తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రి సిదిరి అప్పలరాజు. లోకేష్ పాదయాత్ర అపశృతులతో మొదలైందని విమర్శించారు. మన ఆలోచన సరిగా లేకపోతే చేసే ప్రయత్నం కూడా వృధా అంటూ వ్యాఖ్యానించారు.

లోకేష్ పాదయాత్రను చూస్తే తనకు అదే భావన కలిగిందని విమర్శించారు. లోకేష్ పాదయాత్రకు ఒక లక్ష్యం అంటూ లేదని అన్నారు మంత్రి సిదిరి అప్పలరాజు. ఎన్నికలలో గెలవలేని వ్యక్తి పాదయాత్ర చేస్తున్నారని.. దీనివల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. నేడు రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అర్సపల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న మంత్రి అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news