షర్మిల పార్టీలో చేరే అంశంపై స్పందించిన పొంగులేటి

-

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తో భేటీ అయ్యారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయన షర్మిల పార్టీలో చేరబోతున్నారు అంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని పొంగులేటి అనుచరులు ఖండించారు. అయితే తాజాగా వైఎస్ షర్మిల పొంగులేటి భేటీ పై స్పందించారు. నేడు లోటస్ పాండ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. పొంగులేటితో భేటీ నిజమేనని, పొంగులేటి పార్టీలో చేరతానని తనకి మాటిచ్చారని అన్నారు.

దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అలర్ట్ అయ్యారు. షర్మిల తో భేటీ అయినట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేశారు పొంగులేటి. ఆ వార్తలన్ని అవాస్తవమని స్పష్టం చేశారు. షర్మిలను గత జూలైలో కలిశానని.. అప్పుడు తన కూతురు పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి కుటుంబ సభ్యులతో వెళ్లాలని క్లారిటీ ఇచ్చారు. దీంతో పొంగులేటి షర్మిల పార్టీలో చేరుతున్నారన్న వార్తలు పై ఓ క్లారిటీ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news