ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు జాబితాలో గిల్, సిరాజ్

-

జనవరి నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు పోటీ పడుతున్న క్రికెటర్ల జాబితాను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. పురుషుల విభాగంలో ఈ అవార్డుకు టీమిండియా నుంచి ఇద్దరు క్రికెటర్లు రేసులో ఉన్నారు.

ఆ ఇద్దరే శుభ మన్ గిల్, మహమ్మద్ సిరాజ్ వీరిద్దరితోపాటు న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ దేవన్ కాన్వే కూడా పోటీ పడుతున్నాడు. మరి ఈ ముగ్గురిలో ఎవరు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. టీమిండియాకు లభించిన ఆణిముత్యం శుభ మన్ గిల్. కొన్నాళ్లుగా టెస్టులు మాత్రమే ఆడిన గిల్ తాజాగా వన్డేలు, టీ 20ల్లో తన హవా కొనసాగిస్తున్నాడు. మొదట శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో అతడు 70, 21, 116 రన్స్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news