ఈనెల 13 నుంచి నేను కూడా యాత్ర చేస్తా – కోమటిరెడ్డి

-

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ నెల 13వ తేదీ నుండి తాను కూడా యాత్ర చేపడతానని తెలిపారు. రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలలో యాత్ర చేస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో సమయం లేనందున బస్సు లేదా బైక్ యాత్ర చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాము ఏం చేస్తామో చెబుతామని, అప్పటివరకు ఎవరిని విమర్శించనని స్పష్టం చేశారు.

అయితే హాధ్ సే హాధ్ జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నేతలు యాత్రలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ నెల 6వ తేదీన మేడారం నుండి పాదయాత్రను ప్రారంభించారు. అయితే మిగతా నేతలు కూడా వారి పాదయాత్రల షెడ్యూల్ ఇవ్వాలని పార్టీ ఇన్చార్జి కోరడంతో కోమటిరెడ్డి పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news