అరుదైన రికార్డు సృష్టించిన బన్నీ..!

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి.. ఆయన క్రేజ్ గురించి సౌత్ ఇండియాలోనే కాదు ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమా ఆయనను నార్త్ ప్రజలకు కూడా మరింత దగ్గర చేసింది. పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ తో తన పాపులారిటీని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింప చేశాడు అల్లు అర్జున్. ముఖ్యంగా అభిమానులు ఆయనను కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అని పిలుచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆయన సినిమాల కంటెంట్ ఏదైనా ఆన్లైన్లో విడుదలయితే చాలు అగ్రస్థానంలోనే ఉంటుంది. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలో కూడా ఇప్పుడు ఆయన సినిమాలు బాగా వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఆయన మరొక అరుదైన రికార్డు సృష్టించారు. తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఎక్కువమంది ఫాలోవర్లను కలిగి ఉన్న సెలెబ్రెటీగా రికార్డు సృష్టించడం జరిగింది. ప్రస్తుతం ఆయన తన ఇన్స్టాలో 20 మిలియన్స్ మైలు రాయి సాధించిన తొలి దక్షిణ భారత నటుడిగా రికార్డు సృష్టించారు. అల్లు అర్జున్ ఇటు ఫ్యామిలీకి, అటు అభిమానులకు కూడా చాలా విలువనిస్తారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈయన.. తన భార్య స్నేహ, పిల్లలు అయాన్, అర్హ తో కూడా ఎంజాయ్ చేస్తున్న వీడియోలను, ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటారు.

దాంతో అభిమానులు బన్నీ పెట్టే పోస్టింగ్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయనకు ఫాలోవర్స్ కూడా భారీగా పెరిగిపోయారని తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ షూటింగ్లో బిజీగా ఉన్నారు.. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news