BREAKING : కాంగ్రెస్ పార్టీ ఎంపీ వెంకటరెడ్డిపై కేసు నమోదు

-

BREAKING : కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ కొడుకు సుహాసను బెదిరించిన వ్యవహారంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు అయింది. తనను చంపుతానని కోమటిరెడ్డి వార్నింగ్ ఇచ్చారని సుహాస్ ఫిర్యాదు చేయడంతో ఏపీసి 506 సెక్షన్ కింద ఎంపీపై నల్గొండ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా, చెరుకు సుధాకర్ రెడ్డిని చంపేస్తామంటూ, సోషల్ మీడియాలో ఓ కాల్ రికార్డింగ్ హల్చల్ చేసింది. అయితే ఈ కాల్ రికార్డింగ్ లో చెరుకు సుధాకర్ ను చంపేస్తామంటూ ఆయన తనయుడు డాక్టర్ సుహాస్ కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ వార్తలు ప్రచారం అయింది. దీనికి కోమటి రెడ్డి కూడా అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే, ఎంపీ వెంకటరెడ్డిపై కేసు నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news