అదిరిపోయే గెటప్‌ లో ప్రధాని మోడీ.. ఫోటో వైరల్‌

-

బందీపూర్, ముదుమలై టైగర్ రిజర్వ్‌లకు ప్రధాని నరేంద్ర మోదీ వెళుతున్నారు. ఈ రోజు మైసూరులో ‘ప్రాజెక్ట్ టైగర్’ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా ఈవెంట్‌లో ఆయన తాజా పులుల గణన డేటాను విడుదల చేస్తారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ తరుణంలోనే…డిఫరెంట్‌ వస్త్రాధారణ లో ప్రధాని నరేంద్ర మోదీ కనిపించారు. ఇప్పుడు ఈ ఫోటో వైరల్‌ గా మారింది.


కాగా.. తెలంగాణ ప్రభుత్వం పై మరియు సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రధాని మోడీ. మేము దేశంలో ఏ రాష్ట్రం అయినా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఆ రాష్ట్రం మాతో కలిసి వచ్చి మాకు సహకరిస్తే అది మరింత వేగంగా కార్యరూపం దాల్చుతుందని చెప్పారు. ఇందుకు తెలంగాణ రాష్ట్రం ఏమీ మినహాయింపు కాదు అన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి రావడం లేదన్నారు. ఆ కారణం గానే మీ రాష్ట్రంలో శంకుస్థాపన చేసిన చాలా అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయి అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news