శ్రీవారికి రూ.1 కోటి విరాళం ఇచ్చిన హైదరాబాద్ భక్తులు

-

తిరుమల కొండపై కొలువున్న శ్రీ వేంకటేశ్వరస్వామికి హైదరాబాద్ కు చెందిన భక్తులు భారీ విరాళం అందించారు. ఎస్సార్సీ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ఏవీకే ప్రసాద్, ఏవీ ఆంజనేయ ప్రసాద్ కోటి రూపాయల డీడీని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. తాము అందించిన విరాళాన్ని శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టు కార్యకలాపాలకు వినియోగించాల్సిందిగా ఆ భక్తులు వైవీ సుబ్బారెడ్డిని కోరారు. దీనిపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.

 హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌సీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఏవీకే ప్రసాద్, ఏవీ ఆంజనేయ ప్రసాద్ రూ. 1,00,00,116 రూపాయలను ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కి అందజేశారు. శనివారం తిరుమలలోని ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో డీడీని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చేస్తున్నందుకు ఆ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.తిరుమల శ్రీవారిని మాజీ క్రికెట్ ప్లేయర్ వివిఎస్ లక్ష్మణ్ కూడా దర్శించుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం కల్యాణోత్సవ సేవలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు శ్రీవారి తీర్ధప్రసాదాలు అందజేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news