Telangana : ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. జూన్‌లో తుది ఫలితాలు

-

తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్. పోలీస్‌ నియామకాలకు సంబంధించిన తుది రాతపరీక్షల ప్రక్రియ చివరి దశకు చేరుకోవడంతో తుది ఫలితాల వెల్లడి దిశగా రాష్ట్ర పోలీస్‌ నియామక మండలి కసరత్తు ప్రారంభించింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూన్‌లో వెలువరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రణాళిక ప్రకారం జరిగితే జూన్‌ మొదటి వారంలో తుది ఫలితాలు వెలువడనున్నాయి. అనంతరం అభ్యంతరాల నమోదుకు అవకాశమిస్తారు.

గత నెల 12న ప్రారంభమైన తుది రాతపరీక్షలు ఈ నెల 30 నాటికి ముగియనున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఇప్పటికే పూర్తయిన పరీక్షల పత్రాల మూల్యాంకనానికి చర్యలు తీసుకుంటున్నారు. లక్షల్లో పత్రాల్ని మూల్యాంకనం చేయాల్సి ఉండటంతో అందుకు మే నెలంతా సమయం పడుతుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం అటు టీఎస్‌పీఎస్సీ, ఇటు పదో తరగతి పరీక్షల నిర్వహణలో అక్రమాలు బహిర్గతం కావడంతో ఎలాంటి ఆరోపణలకు తావివ్వకూడదని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సమయం ఎక్కువ తీసుకున్నా సరే.. ఎలాంటి తప్పులు దొర్లకుండా పక్కాగా మూల్యాంకనం చేయించేందుకు సిద్ధమవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news