అరబుడ్డ లోకేష్ మాటలకు త్వరలోనే ప్రజలు సమాధానం చెబుతారు – జోగి రమేష్

-

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి జోగి రమేష్. నేడు గుంటూరు కలెక్టరేట్ లో గృహ నిర్మాణ పథకం పై మంత్రి జోగి రమేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరబుడ్డ లోకేష్ మాటలకు త్వరలోనే ప్రజలు సమాధానం చెబుతారని అన్నారు. ఒకసారి జగన్ పై చంద్రబాబు వాగి వాగి, కారు కూతలు కూస్తే ఆంధ్ర ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో చూసారని.. ప్రజల దెబ్బకు చంద్రబాబు గుబ గుబేల్ అయిందన్నారు.

jogi ramesh

పాక్కుంటూ పాదయాత్ర చేసే లోకేష్ కామెంట్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు మంత్రి జోగి రమేష్. ఇక వైసిపి అధికారంలోకి రాగానే 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. అలాగే వారికి శాశ్వతంగా ఇల్లు నిర్మిస్తున్నామన్నారు. ఇంత మంచి చేస్తుంటే శిఖండి లాగా చంద్రబాబు అడ్డుపడుతున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news