రేషన్ డీలర్లకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త..

-

రేషన్ డీలర్లకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. రేషన్ డీలర్లు సమ్మే ఆలోచన విరమించుకోవాలని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. రేషన్ డీలర్ల సమస్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రి గంగుల కమలాకర్.

ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ..ప్రధాన సమస్యల పరిష్కారంపై కేసీఆర్‌ ప్రభుత్వం కసరత్తు చేసినట్లు చెప్పారు. 22న రేషన్ డీలర్ల సంఘాలతో సమావేశం ఉంటుందని ప్రకటించారు. రేషన్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రావొద్దని కోరారు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. పేదల ప్రయోజనాలకు కేసీఆర్ సర్కార్ కట్టుబడి ఉందని.. సంవత్సరానికి వేలకోట్ల భారం భరిస్తూ పేదల కడుపునింపుతున్న సర్కార్ అని గుర్తు చేశారు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.

Read more RELATED
Recommended to you

Latest news