చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే పవన్ కళ్యాణ్ “వారాహి” కదులుతుంది – అంబటి రాంబాబు

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను నమ్ముకుంటే సర్వనాశనం కావడం ఖాయమని విమర్శించారు. ఆర్ 5 జోన్ లో పేదలకు పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్న చంద్రబాబు దళిత ద్రోహి అంటూ ఆరోపించారు. ఏదో ఒక పార్టీ పల్లకి మోసే పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరారని.. ఆయన కూలి నెంబర్ 1 అంటూ ఎద్దేవా చేశారు.

చంద్రబాబు పచ్చ జెండా ఊపితేనే వారాహి వాహనం కదులుతుందని.. ఆడవాళ్లు బంగారంతో వడ్డానం చేయించుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ వారాహి వాహనం చేయించుకుని ఇంట్లో దాచుకున్నాడని ఎద్దేవా చేశారు. ఈ దేశంలో రాజకీయాలకు అనర్హుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమేనని అన్నారు అంబటి రాంబాబు.

Read more RELATED
Recommended to you

Latest news