రాహుల్ గాంధీలో ఇప్పుడు రాజీవ్ గాంధీ కనిపిస్తున్నారు – ఉండవల్లి

-

రాహుల్ గాంధీలో ఇప్పుడు రాజీవ్ గాంధీ కనిపిస్తున్నారని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీని కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ ఏమీ చేయలేరని బీజేపీకి చురకలు అంటించారు ఉండవల్లి. ఇవాళ మీడియాతో ఉండవల్లి మాట్లాడుతూ… మార్గదర్శి కేసును ఈ ఏడాదిలో ముగింపుకు తీసుకురావాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నానని..రామోజీరావు తప్పు చేశారని నిర్ధారణ చేసుకునే అధికారులు ఆయన ఇంటికి వెళ్లారని తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఏ చిట్ ఫండ్ కంపెనీ నిబంధనలు పాటించడం లేదని ఆగ్రహించారు. చిట్స్ నిబంధనలు పాటించని వారిని ఏం చేయాలో ఒక కమిటీ వేయాలి.. చిట్స్ కేసుల్లో అరెస్టులు అనవసరం అన్నారు. వైసీపీకి చెందిన వారు నిర్వహిస్తున్న చిట్స్ లో అక్రమాలు నా దృష్టికి రాలేదు, వస్తే చెప్పండని కోరారు. మార్గదర్శి కేసులో జూన్ 15వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుందని వివరించారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం దేశానికి మంచిది.. రాహుల్ గాంధీలో ఇప్పుడు రాజీవ్ గాంధీ కనిపిస్తున్నారని వివరించారు ఉండవల్లి.

Read more RELATED
Recommended to you

Latest news