బంపర్‌ ఆఫర్‌.. ఒక్క రూపాయికే ఆ సినిమా టిక్కెట్‌

-

కరోనా తర్వాత థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది. సినిమా లవర్స్​ను థియేటర్ దాకా రప్పించాలంటే కథలో దమ్ముండాల్సిందే. అందుకే చిత్రబృందాలు ప్రేక్షకులను ఆకర్షించేందుకు రకరకాల వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. అలా తాజాగా ఓ సినిమా మేకర్స్ కూడా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేంటంటే..?

యదా యదా హి అనే కన్నడ మూవీ మేకర్స్ ఒక్క రూపాయికే సినిమా చూసే ఆఫర్‌ను ప్రకటించారు. అశోక్‌ తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకులు ముందుకు రానుంది. కాగా సినిమాపై హైప్‌ తీసుకొచ్చేందుకు మేకర్స్‌ గురువారం ప్రీమియర్‌ షోకు ఒక్క రూపాయితో సినిమా చూసే ఆఫర్‌ను పెట్టింది. బెంగళూరులోని వీరేష్ సినిమాస్‌, హుబ్బళిలోని సుధా సినిమాస్‌ థియేటర్‌లలో రూ. 1కే సినిమా చూడొచ్చు అని తెలిపింది. దిగ్‌నాత్‌ మంచలే, వశిష్ట సింహ, హరిప్రియ సింహ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అడివిశేష్ నటించిన ‘ఎవరు’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news