అలుపెరగని పోరాటం, అకుంఠిత దీక్షతోనే ప్రత్యేక రాష్ట్రం సాధించాం: కిషన్‌రెడ్డి

-

కేంద్ర సర్కార్ ఆధ్వర్యంలో హైదరాబాద్​లో చారిత్రాత్మక గోల్కొండ కోటలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ఈ వేడుకలను ప్రారంభించారు. ముందుగా గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తొమ్మిదేళ్ల ప్రస్థానం.. స్వరాష్ట్ర సాధనకు జరిగిన పోరాటం గురించి ప్రసంగించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాసులకు కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కోసం అమరులైన వారిని స్మరించుకున్నారు.

‘తెలంగాణ వచ్చేందుకు కృషి చేసిన సుష్మా స్వరాజ్‌కు నివాళి అర్పిద్దాం. కేవలం ఒకరిద్దరు వల్లే తెలంగాణ రాష్ట్రం రాలేదు. ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రం వచ్చింది. చిన్న రాష్ట్రాల వల్లే ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని బీజేపీ ఉద్దేశం. కుటుంబపాలనతో తెలంగాణలో ఎక్కడ చూసినా అవినీతి. అమరవీరుల ఆకాంక్షల మేరకు ఈ ప్రభుత్వం పనిచేయడం లేదు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు జీవితాలను పణంగా పెట్టారు. తెలంగాణ సాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నమస్సులు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం సాగించాం.’ అని కిషన్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news