నిన్ను చూడగానే బాధంతా మర్చిపోతాను.. నయన్​కు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన విఘ్నేశ్‌

-

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార.. కోలీవుడ్‌ డైరెక్టర్‌ విఘ్నేశ్‌ శివన్‌ వివాహం జరిగి అప్పుడే ఏడాది పూర్తైపోయింది. ఇవాళ వారి మ్యారేజ్ ఆనివర్సరీ సందర్భంగా విఘ్నేశ్ శివన్.. తన భార్యా పిల్లల గురించి ఎమోషనల్ పోస్టు పెట్టారు. తన ఫ్యామిలీ ఫొటోలను యాడ్ చేసిన విక్కీ చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. నెటిజన్లంతా ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

‘‘నువ్వు నా జీవితంలోకి వచ్చి అప్పుడే ఏడాది అయిపోయింది. ఈ సంవత్సరంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాం. ఎన్నో ఊహించని పరాజయాలు.. ఎన్నో పరీక్షలు ఎదురయ్యాయి. ఇలాంటి ఎన్ని చికాకులు ఉన్నా ఒక్కసారి ఇంటికి వచ్చి నిన్నూ పిల్లల్ని చూడగానే అన్నీ మర్చిపోతాను. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబం ఇచ్చే బలం మరేదీ ఇవ్వలేదు. మన పిల్లలు ఉయిర్‌, ఉలగమ్‌లకు మంచి జీవితాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను. నిన్ననే పెళ్లి చేసుకున్నట్లు ఉంది. అప్పుడే ఏడాది అయిందంటే నమ్మలేకపోతున్నాను. మనమిద్దరం కలిసి సాధించడానికి చాలా ఉన్నాయి. మన ఆనందమైన జీవితంలోకి మరో ఏడాదికి స్వాగతం పలుకుదాం’’ అంటూ నయనతారకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news