అప్సర ప్రెగ్నెన్సీకి నా భర్త కారణం కాదు : పూజారి భార్య

-

శంషాబాద్ అప్సర హత్య కేసులో పూజారి సాయికృష్ణ భార్య శ్రావణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అప్సర టార్చర్ వల్లే ఈ హత్య జరిగి ఉండొచ్చు. నా భర్త తన మంచితనం వల్లే ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. కావాలనే ఆయనను ట్రాప్ చేశారు. యాక్సిడెంటల్ గా హత్య జరిగి ఉండొచ్చు.

నా భర్త వల్లే ఆమెకు గర్భం రాకపోయి ఉండొచ్చు. అయినా అప్సర లేట్ నైట్ ఇంటికి వస్తుంటే కుటుంబీకులు ఏం చేస్తున్నారు?’ అని శ్రావణి ప్రశ్నించారు. కాగా, అప్సర హత్యకేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు పూజారి సాయికృష్ణపై 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడిని రాజేంద్రనగర్ కోర్టులో హాజరు పరచగా… కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో సాయి కృష్ణను చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా, అప్సర అనే యువతని సాయికృష్ణ హత్యచేసి సరూర్ నగర్ లో మ్యాన్ హోల్ లో పడేసిన ఘటన నిన్న వెలుగులోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news