BREAKING : నేటి నుంచి ఏపీలో ఒంటిపూట బడులు

-

BREAKING : నేటి నుంచి ఏపీలో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, ఎండల తీవ్రత వల్ల జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలు ఈనెల 17 వరకు ఉదయం పూట మాత్రమే పాఠశాలలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది జగన్‌ సర్కార్‌.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు నేపథ్యంలో వాతావరణ పరిస్థితుల వల్ల అన్ని స్కూల్స్ ఒంటిపూట బడులను నిర్వహించాలని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన పాఠశాలలపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని సర్కార్ హెచ్చరికలు జారీ చేసింది.

ఇక ఇవాళ్టి నుంచి ఉదయం 7.30 నుంచి ఉ.11.30 వరకు మాత్రమే తరగతులు నిర్వహణ జరుగనుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉ.8.30 నుంచి ఉ.9.00 గంటల మధ్యలో రాగి జావ ఇవ్వాలని, మధ్యాహ్న భోజనం ఉ.11 30 నుంచి ఉ.12.00 గంటల మధ్యలో విద్యార్థులకు అందచేయాలని సూచనలు చేసింది ఏపీ సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Latest news