ఏపీలో ఇళ్లు కాదు.. ఊళ్లు కడుతున్నాం : సీఎం జగన్

-

ఏపీలో ఇళ్లు కాదు.. ఊళ్లు కడుతున్నామన్నారు సీఎం జగన్.  గుడివాడలో టిడ్కో ఇళ్ల అందజేత కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగిస్తున్నారు. ‘మనం ఇల్లు కాదు… ఊళ్లు కడుతున్నాం. టిడ్కో ఇల్లు రూపాయికే ఇస్తామని చెప్పామమన్నారు.

గుడివాడలోనే హామీ ఇచ్చాం. నిజం చేసి చూపించాం. టిడ్కో ఇళ్లతో కొత్త గుడివాడ నగరం కనిపిస్తోంది. 16,240 గృహాలు అంటే 40 వేలకు పైగా జనాభా ఉన్నారు. ఒక్కొక్కరికి ఇంటి స్థలం విలువ రూ. 7లక్షలు. ఇల్లు కూడా పూర్తయితే రూ 10 లక్షల ఆస్తి అవుతుంది’ అని వాక్యానించారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. ‘రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాలు అయినా తన జీవితం చంద్రబాబు కోసమే త్యాగం అంటూ ఒకాయన వ్యాన్ ను చూసి మురిసిపోతున్నాడు. తాను కూడా ఎమ్మెల్యే అయిపోతానని, ఎవరు ఆపుతారో చూస్తానని ప్యాకేజీ స్టార్, దత్తత పుత్రుడు అంటున్నాడు. చంద్రబాబు, పవన్ దుష్టచతుష్టయం ఒకవైపు, ప్రజలను నమ్ముకున్న నేను ఒక వైపు ఉన్నాం’ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news