ప్రజల పక్షాన పోరాడుతూ బీజేపీ గెలుపు కోసం కృషి చేయాలి : వివేక్‌ వెంకటస్వామి

-

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంయుక్త మోర్చా, సీనియర్ నాయకుల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి బీజేపీ కార్యకర్తలు తీసుకెళ్లాలని అన్నారు. మోర్చాలు సమర్థవంతంగా పనిచేసి ప్రజల పక్షాన పోరాడుతూ బీజేపీ గెలుపు కోసం కృషి చేయాలని వివేక్ వెంకటస్వామి అన్నారు.

ktr, Vivek Venkataswamy: రాజగోపాల్‌రెడ్డికి కాంట్రాక్టులు వచ్చిన మాట  నిజమే.. వివేక్ క్లారిటీ - bjp leader vivek venkataswamy clarify on  komatireddy rajagopal reddy contracts - Samayam Telugu

కరోనా సమయంల కేంద్ర ప్రభుత్వం దేశంలోని 80 కోట్ల మందికి 24 నెలల పాటు 10 కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని అందించిందని వివేక్ వెంకటస్వామి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఒక్కరికి 5 కిలోల బియ్యం ఇస్తే..రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్క కిలో కూడా ఇవ్వలేదన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి బీజేపీ కార్యకర్తలు తీసుకెళ్లాలని వివేక్ వెంకటస్వామి కోరారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం
చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆయన మండిప్డారు.

Read more RELATED
Recommended to you

Latest news