మోదీకి బైడెన్ విందు.. మెనూలో చిరుధాన్యాల వంటకాలు

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఇవాళ వాషింగ్టన్​లో పర్యటిస్తున్నారు. వైట్ హౌజ్ చేరుకున్న మోదీకి బైడెన్ దంపతులు స్వాగతం పలికారు. బైడెన్ దంపతులు ఇస్తున్న విందులో మోదీ పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చిరుధాన్యాలను ప్రచారంలోకి తీసుకెళ్లాలని ప్రధాని మోదీ చేస్తున్న యత్నానికి అమెరికా తొలి మహిళ జిల్‌ బైడెన్‌ స్పందించారు.

వైట్ హౌజ్​లో మోదీ గౌరవార్థం ఏర్పాటు చేసిన అధికారిక విందు మెనూలో చిరుధాన్యాల వంటకాలను కూడా చేర్చారు. ఆమె గెస్ట్‌ చెఫ్‌ నీనా కుర్టిస్‌తో కలిసి పనిచేస్తున్నట్లు శ్వేత సౌధం ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌ క్రిస్‌ వెల్లడించారు. ఈ అధికారిక విందుకు సంబంధించిన మెనూను శ్వేతసౌధం పేస్ట్రీ చెఫ్‌ సుసీ మారిసన్‌ తయారు చేశారు. విందులో ఫస్ట్‌కోర్స్‌లో.. మారినేటెడ్‌ మిల్లెట్‌, గ్రిల్డ్‌ కార్న్‌ కెర్నల్‌ సలాడ్‌, పుచ్చకాయ, అవకాడో సాస్‌ అందించనున్నారు. ఇక మెయిన్‌ కోర్స్‌లో స్టఫ్డ్‌ పోర్టబెల్లో మష్రూమ్స్‌, కుంకుమ పువ్వుతో కూడిన రిసోటో, లెమెన్‌ దిల్‌ యోగర్ట్‌ సాస్‌, క్రిస్ప్‌డ్‌ మిల్లెట్‌ కేక్స్‌, వేసవి పానీయాలు ఉండనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news