డ్రగ్స్ బారీన యువత పడొద్దు – కృతి శెట్టి కామెంట్స్

-

 

డ్రగ్స్ బారీన యువత పడొద్దని టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కృతి శెట్టి కామెంట్స్ చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన అంతర్జాతీయ మాధక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని హీరోయిన్ కృతి శెట్టి పిలుపునిచ్చారు.

చాలామంది ఫ్రెండ్స్ వల్ల డ్రగ్స్ పారిన పడుతున్నారని… అలాంటి వారికి దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ నియంత్రణలో పోలీసులకు సహాయపడాలని కోరారు. డ్రగ్స్ బారిన పడకుండా యువతను రక్షించడం కోసమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం అని…ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలు అరికట్టడంలో బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనలో మనవంతు పాత్ర పోషించాలని.. పోలీసులకు సహకరించాలని వెల్లడించారు టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కృతి శెట్టి.

 

Read more RELATED
Recommended to you

Latest news