పుస్తెలమ్మిన బండి సంజయ్ కు యాడ్స్ కు రూ. 100 కోట్లు ఎక్కడివి: రఘునందన్

-

తెలంగాణ బీజేపీలోనూ అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. బీజేపీ అధిష్టానం దేశ వ్యాప్తంగా స్టేట్ బాస్ లను మారుస్తున్నాడని తెలిసిన రఘునందన్ రావు తన వాక్కును బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా రఘునందన్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పైన తనదైన రీతిలో విమర్శలు చేశాడు. రఘునందన్ రావు మాట్లాడుతూ పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ చేసిన బండి సంజయ్ కు యాడ్స్ వేయడానికి రూ. 100 కోట్లు ఎక్కడ నుండి వచ్చాయంటూ ప్రశ్నించాడు. నేను ఇంత కాలం పార్టీ కోసం చేసిన కృషికి సరైన ఫలితం దక్కకపోతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తానన్నాడు. తెలంగాణాలో బీజేపీ గెలవాలంటే ఈటల రాజేందర్ మరియు రఘునందన్ బొమ్మలు ఉండాల్సిందే అంటూ మాట్లాడారు.

ఎప్పుడూ కూడా పార్టీ గుర్తు ఎన్నికలలో కీలకం కాదన్న విషయం తెలియచేశాడు. ఇక రఘునందన్ రావు చేసిన ఈ కామెంట్స్ తో తెలంగాణ బీజేపీ నాయకుడు షాక్ కు గురవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news