మంచు లక్ష్మీ పై అలాంటి కామెంట్స్ చేసిన మనోజ్.. పోస్ట్ వైరల్..!

-

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసురాలు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక తాజాగా ఆమె సినిమాలలో పాపులారిటీ దక్కించుకోవడమే కాదు పలు సేవా కార్యక్రమాల ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తన అక్క గొప్పతనాన్ని ఆకాశానికి ఎత్తుతూ.. పొగడ్తలతో ముంచేత్తుతూ ఆమె తమ్ముడు హీరో మంచు మనోజ్ పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు చాలా వైరల్ గా మారుతుంది.. అంతేకాదు తన అక్కను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అంటూ కూడా పోస్ట్ చేశారు మనోజ్..ఇకపోతే మంచు లక్ష్మి నీ ఇంతలా మనోజ్ పొగడడానికి ఒక పెద్ద కారణమే ఉందని చెప్పాలి.

అసలు విషయంలోకి వెళితే.. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చి ఇక్కడ నటిగా, హోస్ట్గా, మోడల్ గా, నిర్మాతగా, హీరోయిన్గా కూడా తనదైన శైలిలో నటిస్తూ దూసుకుపోతున్న ఈమె తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక అటు పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ గొప్ప మనసును చాటుకుంటున్న ఈమె “టీచ్ ఫర్ చేంజ్ “అనే ఒక ఎన్జీవో అని స్థాపించి గత కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.

డబ్బు ఉన్న వారితోపాటు పేదవారు కూడా ఉన్నత చదువులు చదవాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలను ఆమె దత్తత తీసుకొని వాటిలో అత్యధిక వసతులు ,స్మార్ట్ క్లాసులు, ఇంగ్లీష్ క్లాస్ లను ఏర్పాటు చేస్తూ కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అందించేలా ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఈ క్రమంలోనే శ్రీకాకుళం, యాదాద్రి జిల్లాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 500 కు పైగా ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రీసెంట్గా జోగులాంబ గద్వాల జిల్లాలో మరో 30 పాఠశాలలను కూడా ఆమె దత్తత తీసుకుంది. ఇప్పుడు వాటిని కూడా స్మార్ట్ స్కూల్స్ గా మార్చి విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందిస్తామని తెలిపింది మంచు లక్ష్మి. ఈ క్రమంలోనే అక్క చేసిన గొప్ప పనికి మెచ్చుకుంటూ గర్వంగా ఉంది అంటూ మనోజ్ పోస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news